
Earthquake : త్రినేత్రం న్యూస్ : హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో శుక్రవారం రాత్రి 10:04 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో మోస్తరు భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి కేవలం 5 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతం కావడంతో, చంబా, కాంగ్రాతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, చండీగఢ్లో బలమైన ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి. దీంతో ఆందోళన చెందిన జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
