Trinethram News : అమరావతి: రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు చెల్లింపుల విషయంలో పారదర్శకత, వేగం పెంచామని పేర్కొన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లకు పైగా నిధులు జమ చేసినట్టు వెల్లడించారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా రైతులకు ఆలస్యం లేకుండా చెల్లింపులు చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల ద్వారా ఒక్క రోజులోనే రూ.10,571 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి వివరించారు. దీంతో రైతులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలుగుతోందన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం కిసాన్ కింద రైతులకు రూ.6,309 కోట్లు చెల్లించామని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి పీఎం కిసాన్ అమలుకు రూ.6,600 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంపు, ఆర్థిక భద్రత లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


