డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 02 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో సీ పీ ఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు సిపిఐ అగ్ర నేత,మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ.బి.బర్ధన్ 10వ, వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ బర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కామ్రేడ్ బర్ధన్ జీవితం స్ఫూర్తి దాయకమని ఆయన ఆశయాలకు పునరంకితమవ్వాలని శ్రేణులకు బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.
మండల సహాయ కార్యదర్శి తిప్పర్తి విజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.
మైనోద్దీన్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్,కార్యవర్గ సభ్యులు హనుమండ్ల కేశవులు,సోమిడి శ్రీనయ్య,నూనె వెంకటేశ్వర్లు,ఎనమల్ల నవీన్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


