ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 01 25 at 9.44.12 AM

TRINETHRAM NEWS

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Trinethram News : హైదరాబాద్:జనవరి 25
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌, పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది.

రోడ్లు భవనాలశాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌, టీఎస్‌ఐఆర్‌డీ సీఈవోగా పీ కాత్యా యనిదేవి, గనులశాఖ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది…

You cannot copy content of this page