రైతులకు భరోసా – ప్రతి గింజకు మద్దతు ధర కల్పిస్తాం :
ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతు భరోసా కింద ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది వరి దిగుబడి బాగున్న నేపథ్యంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తిని సకాలంలో తీసుకొచ్చి అమ్ముకోవచ్చని, డబ్బు 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతుందని హామీ ఇచ్చారు.
పోలేపల్లి కేంద్రంతో పాటు నియోజకవర్గంలో అన్ని పీఏసీఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొత్తం పీఏసీఎస్ కేంద్రాల ద్వారా రైతులకు సౌకర్యవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆధునిక తేమ కొలిచే యంత్రాలు, బరువును కొలిచే యంత్రాలు, తడి తొలగింపు సౌకర్యంతో పాటు, రైతులకు విశ్రాంతి తీసుకునే విధంగా మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


