Trinethram News : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బూజుపట్టిన లడ్డూ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఘటనసై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. దేవాలయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


