దేవరకొండ ఆగష్టు28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడునట్లు 29/ 8 /2025 ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నుండి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం వరకు ర్యాలీ నిర్వహించబడుతుందని ఎన్ వీ టీ తెలిపారు.అనంతరం మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడడం జరుగుతుందనీ, కావున సభ్యులందరూ తప్పకుండా నేషనల్ స్పోర్ట్స్ డే కి తప్పనిసరి గా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, అలాగే దేవరకొండ నియోజకవర్గం ప్రజలు క్రీడాకారులు కళాకారులు వివిధ క్లబ్బుల సభ్యులు అసోసియేషన్ల సభ్యులు విద్యార్థులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలనీ క్రీడాకారులు తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నట్లు, ఇది క్రీడాకారుల పండుగ కావున అందరూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎన్ వీ టీ ఒక ప్రకటనలో తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


