Trinethram News : ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా రైతులు, తమ కొత్త పట్టా పాస్బుక్లతో ఈనెల 13లోపు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ సూచించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్బుక్లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లోని 101 రైతువేదికల్లో ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపడతారని అధికారి పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


