తేదీ : 25/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి అమావాస్య సందర్భంగా ఇరవై ఐదు కేజీల మల్లెపూలతో ప్రత్యేక పూజలు చేసి అలంకరించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అర్చకుడు కొమ్ము. శ్రీనివాస్ నేతృత్వంలో మద్దాల. సతీష్, కొత్తూరి వెంకటేశ్వరరావు, దంపతులు కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. అదేవిధంగా మద్దాల .సత్యనారాయణ దంపతులు మల్లెపూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు భారీగా హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


