Trinethram News : పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను స్పందించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని ఉదయభాను అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ఎవరికీ చెప్పలేదు, కావాలని ఇది ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. కాగాఉదయభాను జనసేనలో చేరి బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది.


