జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని తెలుగుపల్లి గ్రామానికి చెందిన వేముల అనిత – ఆంజనేయులు దంపతుల చిన్నారుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని డిండి రోడ్డు వైష్ణవి ఫంక్షన్ హాల్ లో జరిగిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు తిపార్థి రుక్మా రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page