శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

TRINETHRAM NEWS

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలోనే దేవస్థానంతో సంప్రదింపులు చేసిన ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది.

శబరిమలలొ అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరగటం…ఆందోళనలకు దిగుతుండటంతో ప్రతిపక్షాలు కేరళ్ ప్రభుత్వం పైన విమర్శలు ప్రారంభించాయి. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రోజుకు శబరిమలకు లక్ష మంది భక్తులు చేరుకుంటుండటం. సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ శ్రేణులపై వాటర్ క్యానన్లతో అడ్డుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
శబరిలమలో నెలకొన్న పరిస్థితుల పైన కేరళ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు. యాత్రికులను వెంబడించి పట్టుకోలేమ‌నీ, కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దనీ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని కోరారు. దీని పైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top