అపరమేధావి డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్ బుక్స్ మరియు విద్యాసామాగ్రి పంపిణీ
Trinethram News : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అపరమేధావి డా. గుగ్గిళ్ల దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నోట్ బుక్స్ మరియు విద్యాసామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.
అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర సైదారావు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీపాల్ రెడ్డి, తోటి ఉపాధ్యాయులు రఘు, కవిత, స్వరూప గౌడ్, కొమ్ము సద్గున్, కిన్నెర గిరి ప్రసాద్, కట్టెకోల వెంకన్నగౌడ్, సుశీల, అభిమానులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


