Deputy CM Batti Vikramarka : హిమాచల్ ప్రదేశ్ సీఎంతో, తెలంగాణ ఉప సీఎం బట్టి విక్రమార్క భేటీ!

TRINETHRAM NEWS

హిమాచల్ ప్రదేశ్ సీఎంతో, తెలంగాణ ఉప సీఎం బట్టి విక్రమార్క భేటీ!

Trinethram News : హైదరాబాద్:జనవరి 30
హిమాచల్‌ ప్రదేశ్‌లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు చేపట్టబోతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం బూట్‌ బిల్ట్‌ ఓన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌, విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు చేపట్టబోతుంది.

ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 100 మెగావాట్లకు పైగా కెపాసిటీ గల ప్రాజెక్టులు చేపడుతుం దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఢిల్లీలో హిమా చల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియర్‌ ప్రాజెక్టు లపై ఆసక్తి చూపుతోందని.. వీటిని చేపట్టేందుకు ఎంవో యూ సిద్ధం చేయాలని కోరారు. దానిని పరిశీలించి వీలైనంత త్వరగా ఒప్పం దం చేసుకునేలా తాను చర్యలు చేపడుతానని భట్టి హామీ ఇచ్చారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top