Republic Day : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భారతదేశ ప్రజలు స్వేచ్ఛ సమానత్వం తో రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారని ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ అదేవిధంగా సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం కార్మిక చట్టాల పరిరక్షణ కోసం పాటుపడాలని దానికోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హక్కుల పరిరక్షణకు డిమాండ్ల సాధనకు ఎల్లప్పుడూ ముందుంటుందని కార్మికుల సంక్షేమం కోసం పోరాటాలు చేస్తూనే ఉంటుందని వారు పేర్కొన్నారు
RG 1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు క‌నకం శ్యామ్సన్ జావిద్ పాషా, చెల్పూరి సతీష్, పొలాడి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, ఇందూరు సత్యనారాయణ, చల్లా రవీందర్ రెడ్డి, కోండ్ర అంజయ్య, వాసర్ల జోసెఫ్, సురేందర్ ,బొగ్గుల సాయి కృష్ణ,గోపి, అప్సర్ పాషా, పులిపాక శంకర్, ప్రదీప్, , మార్క వెంకటస్వామి,మీస రాజు, కళధర్రెడ్డి, మిట్టపల్లి మహేష్, మురళి, రాజ్ కుమార్, నరేష్,ప్రసాద్, భాస్కర్, ఆరిఫ్, నగేష్ అయిలయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top