TRINETHRAM NEWS

Trinethram News : ISRO : 9th Jan 2024

గమ్యానికి చేరుకున్న ఆదిత్య ఎల్ 1

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేరింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శనివారం తుది కక్ష్య లెగ్రాంజ్ పాయింట్ 1లోకి చేరింది. గతేడాది సెప్టెంబర్ 2న దీనిని ఇస్రో ప్రయోగించింది. 127 రోజులలో 15 లక్షల కిలోమీటర్ల దూరం ఆదిత్య ఎల్1 ప్రయాణించింది. ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. దీని ద్వారా సౌర తుఫాన్లతో పాటు, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేయనుంది.