కమీషనరేట్ లో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి హోంగార్డుల క్షీరాభిషేకం

TRINETHRAM NEWS

కమీషనరేట్ లో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి హోంగార్డుల క్షీరాభిషేకం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హోంగార్డుల రోజువారి వేతనం 1000 కి పెంపు చేయడంతో పాటు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల ఎక్స్ గ్రేషియా, విక్లీ పరేడ్ అలవెన్స్ ను రూ. 200కు పెంచడంతోపాటు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 2025 జనవరి 1 నుంచి హోంగార్డులకు వర్తింప చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 6 న హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ హోం గార్డ్స్ ఆఫీస్ వద్ద హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

కార్యక్రమంలో హోంగార్డు ఆర్ ఐ మల్లేశం, పెద్దపల్లి జోన్ హోం గార్డ్స్ ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ మనోహర్, హోం గార్డ్స్ పిఎల్ సి సత్యనారాయణ, కుమార్, బ్రమ్మచారి, శ్రీనివాస్,నర్సయ్య, చంద్రమౌళి, రాము పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top