చెన్నారెడ్డిని కలిసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి

TRINETHRAM NEWS

చెన్నారెడ్డిని కలిసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ లోని జ్యోతి రావు ఫులే ప్రజా భవన్ లో జరిగిన ప్రజావాణిలో తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ చిన్నారెడ్డిని తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మర్యాదపుర్వకంగా కలిసి గంగపుత్రులను ఎం బి సి ల జాబితాలో చేర్చాలని వినతి పత్రము అందించారు అనంతరము తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచు గత ప్రభుత్వము 36 బి సి కులాలను ఎం బి సి జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు సాంప్రదాయ మత్యకార గంగపుత్రులు కేవలం చేపల వేటే కుల వృత్తిగా జీవనం సాగిస్తూ పేదరికంలో ఉండి విద్య రాజకీయ ఆర్ధిక సామజిక రంగలలో అత్యంత వెనుకబడి ఉన్నారన్నారు దేశములో చాలా రాష్టలలో సాంప్రదాయ మత్యకార గంగపుత్ర కులస్తులను ఎస్ టి ఎస్ సి లుగా గుర్తించారన్నారు తెలంగాణలో బి సి ఏ సీరియల్ నెంబర్ ఒకటిలో ఉన్న గంగపుత్రులను ఎం బి సి జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కు వినతి పత్రము అందించినట్లు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top