జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 22 at 10.44.04

TRINETHRAM NEWS

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో నేడు తుది తీర్పు

Trinethram News : హైదరాబాద్ : నవంబర్22
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి, దాఖలు చేసిన అప్పిళ్లపై నేడు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం తీర్పు వెలువరించనుంది,

రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉండటం తో సెప్టెంబర్ 30న అప్పిల్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరపున సుదీర్ఘ వాదనలు ధర్మాసనం విన్నది, నేడు తుది తీర్పు వెల్లడించనుండడంతో భద్రాచలం నియోజకవర్గం లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

తీర్పు ఎమ్మెల్యేకు అనుకూలంగా వస్తుందా… లేక ప్రతికూలంగా వస్తుందా..? అనే చర్చ జోరుగా సాగుతుంది. ఒకవేళ ప్రతికూలంగా వస్తే ఏం చేయాలో ఇప్పటి నుండే సమాలోచనలు జరుపుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి, ఎన్నికలు అనంతరం కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, డాక్టర్ తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయుంచారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలానే వ్యాజ్యాలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహ చార్యులు పిటిషన్ దాఖలు చేశారు.

బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్ జడ్జి సెప్టెంబర్ 9 న ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని దాఖలైన రెండు పిటిషన్ లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12 న వాదనలు ముగించింది.

ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావు తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page