TRINETHRAM NEWS

Trinethram News : Telangana : Oct 10, 2024,

తెలంగాణలోని కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్‌ది సన్నకారు రైతు కుటుంబం. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో చదువుకున్న ఆయన.. డీఎస్సీ సాధించలేకపోయారు. చివరికి రైతుగానే మిగిలిపోయారు. కానీ తండ్రి కలను కుమార్తెలు సుధ, శ్రీకావ్య నిజం చేశారు. స్కూల్ అసిస్టెంట్ కోసం సిద్ధమైన సుధ.. మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించారు. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికయ్యారు. ఇద్దరూ ఒకేసారి హైదరాబాద్‌లో నియామకపత్రాలను అందుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App