TRINETHRAM NEWS

Trinethram News : Medchal : ఈ రోజు దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారు సరస్వతి అవతారంలో ఉంటూ విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లిగా పూజలందు కుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అర్కల అనంతస్వామి, స్థానిక బస్తీ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App