PM Modi : సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం

TRINETHRAM NEWS

PM Modi condoles death of Sitaram Yechury

Trinethram News : Sep 12, 2024

ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఏచూరికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి వామపక్షాల వెలుగు అంటూ కొనియాడారు. ఈ మేరకు సీతారాం ఏచూరికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. వామపక్షాలకు అగ్రగామిగా నిలిచారని కొనియాడారు. సమర్థవంతమైన పార్లమెంటేరియన్ గా పని చేశారని ప్రశంసించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి, అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లో అందరితో కనెక్ట్ అయ్యే నాయకుడని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Modi condoles death of Sitaram Yechury

You cannot copy content of this page

Scroll to Top