TRINETHRAM NEWS

IPL వేలానికి 333 మంది క్రికెటర్లు

ఈ నెల 19న జరిగే ఐపీఎల్‌ వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. ఖాళీలు 77 మాత్రమే.

హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర ₹2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌ ₹10.75 కోట్లకు అమ్ముడుపోయాడు.

ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది.

ఇందులో 214 మంది భారతీయులు ఉన్నారు.

వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం ₹262.95 కోట్లు ఉన్నాయి.

ఆసీస్‌ ఆటగాళ్లు కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌, ఇంగ్లిస్‌, మిచెల్‌ స్టార్క్‌లకు మంచి డిమాండ్‌ ఉండనుంది.