మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రిగా:మోహన్ యాదవ్

TRINETHRAM NEWS

మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రిగా:మోహన్ యాదవ్

భోపాల్:డిసెంబర్ 11
మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రిగా మోహన్ యాదవ్‌ ను బిజెపి అధిష్టానం ప్రక టించింది. అసెంబ్లీ స్పీకర్ గా నరేంద్ర సింగ్ తోమర్, డి ప్యూటీ సిఎంలుగా జగదీశ్ దేవ్డా, రాజేశ్ శుక్లాల పేర్లను బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.

ఉజ్జయని సౌత్ నుంచి మోహన్ యాదవ్ ఎంఎ ల్‌ఎగా గెలిచారు. 2013లో తొలిసారిగా మోహన్ ఎంఎల్ఎగా గెలిచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తిని బిజెపి సిఎంని చేసింది.

మోహన్ యాదవ్ కు బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడంతో అతడి వైపుకు అధిష్టానం మొగ్గు చూపింది. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 163 సీట్లు గెలిచి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయ నుంది.

కాంగ్రెస్ 66 సీట్లు గెలిచి ప్రతిపక్ష స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్‌కు శివరాజ్ సింగ్ సిఎంగా సేవలం దించారు.

ఇప్పుడు మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ కు మొండి చేయి చూపించింది. ఎని మిది రోజుల ఉత్కంఠకు తెరలేపింది..

You cannot copy content of this page

Scroll to Top