జూలై 23, 2026

WhatsApp Image 2023 12 25 at 1.06.54 PM

TRINETHRAM NEWS

క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల

ఖమ్మం : నగరంలోని చర్చికాంపౌండ్ లోని సీఎస్ఐ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని
ప్రత్యేక ప్రార్థన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్, బిషప్ లు ఈ సందర్భంగా ఇద్దరి మంత్రులకు ఆశీర్వచనలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చల్లని చూపు తెలంగాణ ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మీద ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

You cannot copy content of this page