CM Chandrababu Met PM : ముగిసిన ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

TRINETHRAM NEWS

AP CM Chandrababu met with the Prime Minister which ended

Trinethram News : న్యూ ఢిల్లీ : జులై 04
ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగి సింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివ రించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు సమాచారం.

అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు.

మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో చంద్రబాబు సమావేశం కానున్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP CM Chandrababu met with the Prime Minister which ended

You cannot copy content of this page

Scroll to Top