TRINETHRAM NEWS

A case has been registered under the new law against MLA Padi Kaushik Reddy of Huzurabad

Trinethram News : హుజురాబాద్ :-
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది. భారత్ న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డు సృష్టించారు.

నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేశారు జడ్పీ సిఈవో. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో అడ్డుకుని బైఠాయించారు ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి.

ఈ తరుణంలోనే… భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది.

బీఎన్ఎస్ చట్టం అమలు లొకి వచ్చిన రెండవ రోజే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది. కాగా నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపిం చారు.

డీఈఓను సస్పెండ్ చేయా లంటూ నిరసన తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా ఎడ్యుకేషన్ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించే అర్హత మాకు లేదా? అని ప్రశ్నించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A case has been registered under the new law against MLA Padi Kaushik Reddy of Huzurabad