రైలు ఢీకొని వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

A person died after being hit by a train

Trinethram News : వికారాబాద్ :-
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘ టన వికారాబాద్-సదాశివ పేట రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఉదయం చోటుచేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా నవపేట మండలం మమ్మదనపల్లి గ్రామ సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గ్రామస్తులు గమనించి రైల్వే పోలీసు లకు సమాచారం ఇచ్చారు..

ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (30) రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్టు స్థానికులు భావిస్తున్నారు. శవాన్ని వికారాబాద్ ప్రభు త్వ ఆసుపత్రి కి తరలించి మార్చురిలో భద్రపరిచారు.

ఈ మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A person died after being hit by a train

You cannot copy content of this page

Scroll to Top