TRINETHRAM NEWS

Protest: నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఇండియా కూటమి..

Delhi..

INDIA Alliance: పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి, మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ విపక్ష పార్టీ నేతలు తెలిపారు..

పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి..

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘ఇండియా’ కూటమి పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు..