WhatsApp Image 2024 03 29 at 21.40.20
Trinethram News : Mar 29, 2024,
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్ లో స్వీకరించిన విజ్ఞప్తులను సంబంధిత మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయిస్తున్నారు. శుక్రవారం మంత్రి సీతక్కను పరమేశ్వర్ రెడ్డి కలిసి వడ్డీ లేని రుణాలు, మహిళా సంక్షేమం, మహిళా సాధికారత, తదితర అంశాలకు సంబంధించిన ప్రజా దర్బార్ విజ్ఞప్తుల గురించి వివరించారు.
