2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంలో కేంద్ర బలగాలు కవాతు

TRINETHRAM NEWS

Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం

కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ ,ఆర్ డి ఓ ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పట్టణంలో ఫ్లాగ్ మార్చింగ్ కవాతు

డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఫ్లాగ్ మర్చింగ్ ఒక ఉద్దేశం ఓటర్లకు భరోసా కల్పిస్తూ వారిలో ధైర్యం నింపుతూ ,ఎటువంటి శాంత భద్రతలకు విగతం కాకుండా పోలీసులు కుప్పం రెవిన్యూ డిపార్ట్మెంట్ కట్టుదిద్ధమైన ఏర్పాటు చేశామన్నారు

కుప్పం సబ్ డివిజన్ పోలీస్ , రెవిన్యూ డిపార్ట్మెంట్ సార్వత్రిక ఎన్నికలకు తాము సంసిద్ధగా ఉన్నామని తెలియజేశారు..

ప్రతి ఓటరు పోలింగ్ రోజు తమ ఓటును ధైర్యంగా, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లోన్ కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఫ్లాగ్ మార్చు యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

కుప్పం రైల్వే స్టేషన్ కూడలిలో
వైసిపి ఎమ్మెల్సీ భరత్ కుప్పం సబ్ డివిజన్ డిఎస్పి శ్రీనాథ్, కేంద్ర బలగాలనుకు ఆహ్వానించారు

ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ఓటర్లకు ఓటు హక్కును స్వచ్ఛందంగా భయభ్రాంతులకు గురి కాకుండా వినియోగించుకున్నందుకు ధైర్యం నింపుతున్న కేంద్ర బలగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

కుప్పం పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతాలలో ఎన్ ఎన్ సి విద్యార్థులతో డ్రిల్లింగ్ చేస్తూ , కేంద్ర బలగాలు, కుప్పం పోలీస్ వ్యవస్థ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top