TRINETHRAM NEWS

రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

నేడు శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ

ప్రభుత్వ సమాధానం ఉండనుంది.

శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.

మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరుస్తారు.

మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా, బి మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు.

అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం cm రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు.

గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను….

తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికన ఉభయసభల ముందు టేబుల్ చేస్తారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉపసభల ముందు టేబుల్ చేస్తారు.

రేపు శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం నేడు సమావేశం.

అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం కానుంది.

బడ్జెట్​కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ నివేదిక ఇచ్చింది.

విజిలెన్స్ నివేదికపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ ఆలోచన.

న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది

రిటైర్డ్ జస్టిస్ చే విచారణ చేయించాలని సర్కార్ ఆలోచన.

ఇలాంటి విషయాలపై కేబినేట్​లో చర్చించే అవకాశం.

వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.