శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగనున్న స్వామి వారి 53వ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అంకెనపల్లి వేణుగోపాల్ యాదవ్, ఈఓ కృష్ణమాచార్యులు,గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, అంజన్ గౌడ్, పంతులు రామ్ గోపాల చారి, ప్రవీణ్ గుప్తా, సమ్మయ్య యాదవ్, వెంకటేష్, పాపి రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top