
Anna Lezhneva : త్రినేత్రం న్యూస్ : భర్త ఆరోగ్యం కోసం తపన.. అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ శ్రీవారి చెంతకు.. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా.. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వచ్చిన అన్నా లెజ్నేవా… చివరి మెట్టు వద్ద కొబ్బరి కాయ కొట్టిన అన్నా లెజ్నేవా..
అనంతరం నేరుగా వరాహస్వామి ఆలయంకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసిన అన్నా లెజ్నేవా.. గతంలో కూడా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామి వారిని దర్శించుకున్న పవన్ సతీమణి.. తల నీలాలు కూడా సమర్పించారు.. తన కుమారుడు స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడడంతో శ్రీవారి చెంతకు అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్లి.. తలనీలాలు సమర్పించి.. మొక్కు తీర్చుకున్నారు..
తాజాగా శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శించుకుని కోరుకున్నట్లు తెలుస్తోంది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe