
6లక్షల ఆస్తి నష్టం
Trinethram News : పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, లక్ష్మీపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి మిర్చి మండేకు నిప్పంటించారు.బాధిత రైతు వజ్రాల సురేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపురం గ్రామంలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట వేసి రెండవ కోత పూర్తి చేసి మార్కెట్ కు తరలించేందుకు 50 క్వింటాళ్ల ఎండు మిర్చిని కల్లంలో నిల్వ చేశాడు. దుండగులు అర్ధరాత్రి తగలబెట్టడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
