TRINETHRAM NEWS

Trinethram News : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి.

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు.

ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరింది.

దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తోంది.

ఈ క్రమంలో మూడు వేల పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.