TRINETHRAM NEWS

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామం నందు వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.

అలాగే వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు, నూతనంగా వచ్చిన పెన్షన్ దారులకు 3 వేల రూపాయల వైయస్సార్ పెన్షన్ కానుక ను అందించారు.

అనంతరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జగనన్న ప్రభుత్వం ద్వారా పూర్తి ఉచితంగా వచ్చిన ట్యాబ్ లను విద్యార్థులకు పంపిణీ చేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…