TRINETHRAM NEWS

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

అమరావతి: నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్‌ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు..

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అత్యాశ, అసూయతో జగన్‌ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములు ఇచ్చిన వేల మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం వృథా కాదని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు..