TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు.

తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు.

ల్యాండ్, ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేసినట్లు తెలుస్తుందన్నారు .

కేసు రీ ఇన్వెస్టిగేషన్ చేసి హత్యకు ప్రధాన కారణాలు, వాస్తవాలు వెల్లడిస్తామన్నారు.