TRINETHRAM NEWS

తాడేపల్లి

వేమారెడ్డిని కలిసిన విజయసాయిరెడ్డి

మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో శనివారం వైసిపి ఏంటీఎంసీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డిని రాజ్యసభ సభ్యులు
విజయ్ సాయిరెడ్డి మంగళగిరి వైసీపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.దుగ్గిరాలకు సంబంధించిన
పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని వైసిపి విజయానికి కృషి చేయాలని
అన్నారు. కలిసికట్టుగా ముందుకు వెళితే మంగళగిరి నియోజకవర్గంలో
గెలుపు తధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, పేర్లపూడి సర్పంచ్ గంగాధర్ రావు,షేక్ బాషా,పిల్లి రాఘవులు, శైలజ, రజనీకాంత్,లోకేష్,ఆళ్ల మహేష్, వైసీపీ నాయకులు మేకా అంజిరెడ్డి, యూ.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.