TRINETHRAM NEWS

Ex-minister Varyulu Venkata Swamy (Kaka) Jayanti celebrations were held in Singareni under the leadership of Telangana State Minimum Wage Advisory Council Chairman Mr. Janak Prasad

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని జనక్ భవన్ యందు INTUC ఆధ్వర్యంలో వేంకట స్వామి ( కాక ) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ . దేశ సేవకు అంకితమైన రాజనీతిజ్ఞుడు కె. వెంకటస్వామి అని. కార్మికులు కాకా అని ముద్దుగా పిలుచుకునే వారని , అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా కేంద్ర కార్మిక, జౌళి, గనుల శాఖ మంత్రిగా ఆయన చేసిన కృషి మనకు స్ఫూర్తి అని. కాంగ్రెస్ పార్టీ కి అత్యంత నమ్మకమైన వ్యక్తి గా ఆయన పని చేశారని , కార్మికుల మూడవ హక్కు అయిన కాంట్రిబ్యూట్ పెన్షన్ అమలు కోసం కృషి చేశారని . వారు కార్మికులకు చేసిన సేవలకు గాను సింగరేణి వ్యాప్తంగా వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని తెలియచేశారు.
ఆర్ జి -1 వైస్ సదానందం అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ధర్మపురి , జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్ , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , జిల్లా అధ్యక్షులు దాస్ , సెంట్రల్ డెప్యూటీ జనరల్ సెక్రెటరీ టైసన్ శ్రీనివాస్ , సెంట్రల్ నాయకులు గడ్డం కృష్ణ , బత్తుల పోచయ్య , బేబీ శ్రీను , బ్రాంచ్ నాయకులు శ్రీనివాస్ , అన్వేష్ , నాయిం , ఆంజనేయులు , పుట్ట రమేష్ , అల్లావుద్దీన్ , వెంకటేష్ , కుశనపల్లి శంకర్ , కుమార్ , బుచ్చయ్య , రమేష్ , రాజశేఖర్ , సుధాకర్ తదితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Ex-minister Varyulu Venkata Swamy (Kaka) Jayanti celebrations were held in Singareni under the leadership of Telangana State Minimum Wage Advisory Council Chairman Mr. Janak Prasad