TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన తహసీల్దార్లు సంబంధిత కలెక్టర్లకు రిపోర్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.