TRINETHRAM NEWS

సంఘటనలు

1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.

1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.

2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.

2023 – ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.

2023: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

జననాలు

1890: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1988)
“భారతరత్న” పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు.

1892: విలియం పి. మర్ఫీ, రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త.

1911 : అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం.

1923: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)

1932: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)

1947: కె.వి.కృష్ణకుమారి, రచయిత్రి.

1956: కావలి ప్రతిభా భారతి, రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.

మరణాలు

1804: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ను కనుగొన్నవాడు. (జ.1773)

1827: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (జ.1762)

1889: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909)

1925: దామెర్ల రామారావు, చిత్రకారుడు

1931: మోతిలాల్ నెహ్రూ, భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు. (జ.1861)

1965: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

1976: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)

2008: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950)

2015: ఆత్మారాం భెండే, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు

2022: భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, గాన కోకిల ‘లతా మంగేష్కర్’ మరణం. (జ. 1929)