TRINETHRAM NEWS

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని చెప్పి వారిని ఖాళీ చేయాలనీ అధికారులు చెప్పటం తో వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రజల సమస్యను తెలుసుకుని వారికీ ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి వారు నివాసం ఉంటున్న స్థలాలకు నివేశన పట్టాలు ఇచ్చి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమము తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు