తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు నేడు కొట్టేసింది. దీన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్లతో కూడిన బెంచ్ విచారించింది. అనంతరం తీర్పు వెలువరిస్తూ ఆ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 20న ఈ కేసులో వాదోపవాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
2014-15, 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్ ఆదాయంపై ఐటీశాఖ పునఃపరిశీలన చేపట్టింది. దీనిని ఆపాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పక్షాన పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పునఃపరిశీలనకు ఉన్న గడువు తీరిపోయిందని.. కేవలం ఆరేళ్లు మాత్రమే వెనక్కివెళ్లి అధికారులు పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి ఐటీశాఖ సమాధానం ఇస్తూ.. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. స్వాధీనం చేసుకొన్న ఆధారాలను బట్టి రూ.520 కోట్ల మేరకు తేడాలు వస్తున్నట్లు పేర్కొంది.
ఆ పార్టీ మొత్తం రూ.100 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలని ఐటీ విభాగం ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీనిపై అప్పిలేట్ ట్రైబ్యూనల్ను ఆశ్రయించింది. అది కాంగ్రెస్ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ఇటీవలే హైకోర్టు కాంగ్రెస్ పార్టీకి తెలిపింది. ఇక పునః పరిశీలన ఆపే అంశాన్ని నేడు కొట్టివేసింది..
కాంగ్రెస్ పిటిషన్ను కొట్టేసిస హైకోర్టు
Related Posts
నేటి నుంచి సివిల్స్ మెయిన్స్
TRINETHRAM NEWS Civils Mains from today Trinethram News : నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్20, 21, 22, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1…
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్
TRINETHRAM NEWS Choreographer Johnny Master arrested త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఓ మహిళా డాన్సర్పై…