సైదాపేట : నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణా, పుదుచ్చేరి గవర్నర్ పదవులకు రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపిన తమిళిసై మంగళవారం చెన్నై చేరుకున్నారు. ఆమె విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించేందుకే పదవికి రాజీనామా చేశానని అన్నారు. తెలంగాణా, పుదుచ్చేరి ప్రజల ఆప్యాయతకు రుణపడి ఉంటానన్నారు. గవర్నర్గా అవకాశం ఇచ్చిన ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ప్రజల మధ్య ప్రత్యక్షంగా పని చేయటమే ఇష్టమని పేర్కొన్నారు. గవర్నర్ పదవితో చాలా అనుభవం దక్కిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు ఎన్నికలు, గవర్నర్ బాధ్యతుల కూడా నిర్వర్తించానని తెలిపారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొని అభినందనలు అందుకున్నానని చెప్పారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చానంటే ఎందుకనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని తెలిపారు.
నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు
Related Posts
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్
TRINETHRAM NEWS Choreographer Johnny Master arrested త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఓ మహిళా డాన్సర్పై…
BJP MLA Munirathna : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచార కేసు నమోదు
TRINETHRAM NEWS Rape case registered against Karnataka BJP MLA Munirathna Trinethram News : Karnataka : Sep 19, 2024, కర్ణాటక బీజేపీ రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది.…