TRINETHRAM NEWS

Trinethram News : అమెరిక : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గత ఎనిమిది నెలలుగా ISSలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నాసా ఇప్పుడు ఆమెతో పాటు తన తోటి వ్యోమగాములను సురక్షి తంగా భూమికి తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది.

ఇందుకోసం ఈ అమెరికా అంతరిక్ష సంస్థ ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సహాయం తీసుకుంటోంది. క్రూ రొటేషన్ పేరుతో నాసా ఈ క్రూ-10​ మిషన్​ ప్రయో గించనుంది. ఈ నేపథ్యంలో నాసా, స్పేస్‌ఎక్స్ సంస్థలు క్రూ-10ని పంపించేందుకు పాత అంతరిక్ష నౌకను ఉపయోగించాలని నిర్ణయించాయి.

అయితే ఇంతకు ముందు ఈ రెస్క్యూ మిషన్​ కోసం కొత్త స్పేస్​ క్రాఫ్ట్​ను ఉపయో గించాలని ప్లాన్ చేశాయి. ప్లాన్​ను మార్చుకున్న నాసా అండ్ స్పేస్​ఎక్స్:నాసా వెబ్‌సైట్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం..

ఈ మిషన్​ కోసం క్రూ-10ని మార్చి 12, 2025న ప్రయోగించొచ్చు. అయితే నాసా ఈ తేదీని కూడా మార్చే అవకాశం ఉంది. ఇది ఈ మిషన్ ప్రిపరేషన్స్, ఫ్లైట్ రెడీనెస్ ప్రాసెస్ పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది.

క్రూ-10తో కొన్ని రోజుల హ్యాండోవర్ పీరియడ్​ను పూర్తి చేసిన తర్వాత క్రూ-9 ద్వారా ఈ వ్యోమగాములు తిరిగి భూమికి చేరనున్నా రు. హ్యాండోవర్ పీరియడ్​లో అంటే క్రూ-10 టీమ్ ISSకి చేరుకున్న తర్వాత ఇప్పటికే అక్కడ ఉన్న సిబ్బంది నుంచి తమ పని గురించి సమాచారాన్ని పొందుతుంది.

ఇవన్నీ అనుకున్నట్లుగానే సవ్యంగా జరిగితే ఇద్దరు సిబ్బంది మధ్య సేఫ్ ట్రాన్సిషన్ జరుగుతుం ది.పాత ప్రణాళిక ఇదే!: సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకురావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ పాత ప్రణాళిక ప్రకారం..

క్రూ-10 కోసం కొత్త డ్రాగన్ స్పేస్​ క్రాఫ్ట్​ను లాంఛ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు స్పేస్‌ఎక్స్ ఈ మిషన్ కోసం “ఎండ్యూ రెన్స్” అనే పాత డ్రాగన్‌ని పంపాలని నిర్ణయించు కుంది.

అయితే కొత్త డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్​ ప్రయోగానికి సిద్ధం చేసేందుకు మరింత సమయం పడుతుందని, అందుకే పాత వ్యోమనౌకను ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది.

ప్రణాళికలో ఈ మార్పుతో సునీతా విలియమ్స్, ఆమె తోటి వ్యోమగాములను త్వరగా భూమికి తీసుకు రావచ్చని అమెరికా అంత రిక్ష సంస్థ భావిస్తోంది. ఇకపోతే ఈ “ఎండ్యూరెన్స్” డ్రాగన్ వ్యోమనౌక ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు అంటే క్రూ-3, క్రూ-5, క్రూ-7 మిషన్​లలో ISSకి వెళ్లింది.

ఇప్పుడు నాలుగోసారి ఈ స్పేస్‌క్రాఫ్ట్ క్రూ-10తో ప్రయాణించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు వ్యోమ గాములను సిద్ధం చేసింది,క్రూ-10 మిషన్

కమాండర్ (1)NASA ఆస్ట్రానాట్ అన్నే

పైలట్ : NASA ఆస్ట్రానాట్ నికోల్ అయర్స్మిషన్

స్పెషలిస్ట్స్:జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్

ఏజెన్సీ జాక్సా,కి చెందిన టకుయా ఒనిషి,రష్యా అంతరిక్ష సంస్థ రోస్కో స్మోస్‌కు చెందిన కిరిల్ పెస్కోవ్.

క్రూ-10 ISSకు చేరుకున్న తర్వాత క్రూ-9లో నాసాకు చెందిన నిక్ హైగ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, రష్యాకు చెందిన అలెగ్జాండర్ గోర్బునోవ్‌ భూమికి తిరిగి రానున్నారు.

అయితే క్రూ-10 మిషన్‌ను మార్చి 12న ప్రయోగిస్తే అదే నెల చివరిలోగా సునీతా విలియమ్స్‌తో సహా ISSలో చిక్కుకున్న వ్యోమగాము లందరూ భూమికి తిరిగి వస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 13 at 11.53.47
Sunita Williams