TRINETHRAM NEWS

సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు..

వికారాబాద్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మార్గశిర మాసం, సుబ్రహ్మణ్య షష్టి (సుబ్రహ్మణ్యస్వామి పుట్టిన తిథి) సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ఆయురా రోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.