TRINETHRAM NEWS

శ్రీనిధి రియల్ఎస్టేట్ లేఔటు ఆక్రమణలు తొలిగింపు

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 4: నెల్లూరు జిల్లా: కావాలి. కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి, నెల్లూరు జిల్లా కావలి పురపాలక సంఘం పరిధిలో ఉన్న అనధికార లేఔట్ల విషయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కావలి పాతూరు యంగయ్య పాలెంలో, ఉన్న శ్రీనిధి డెవలపర్స్ నందు సర్వే నెంబర్1329,1330,1331,1332 ,1333 గల విస్తీర్ణ 4.0 ఎకరాలలో అనధికారిక లేఔట్ గా మున్సిపల్ అధికారులు గుర్తించారు.

ఈ లేఔట్ పరిధిలో గల ప్లాట్లు సరిహద్దురాలను, రోడ్లను జెసిబి ద్వారా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ , దగ్గరుండి తొలగించడం జరిగింది. (నుడా) అనుమతి పొందిన లేఔట్ నందు ఆక్రమణ చేసిన కాలువలను తిరిగి పునర్దించడమైనదని సదరు లేఔట్లు నందు ఎటువంటి అనుమతులు ఇవ్వబడవని ఈ విషయంపై ప్రజలు అవగాహన కల్పించుటకు మీడియా ద్వారా తెలుపుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Srinidhi Real Estate