TRINETHRAM NEWS

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139

మల్దకల్: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.24,07,139 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. సోమవారం దేవాలయ ఆవరణంలో నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో
రూ.24,07,139 రాగా గత ఏడాది రూ.20,11,134 కాగా ఈసారి రూ.3,96,005 ఆదాయం పెరిగిందని తెలిపారు. చింతల ముని రంగస్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ.1,08,850 కాగా
గత ఏడాది రూ.85,625 రాగా ఈసారి రూ.23,225/- ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు దేవాలయ సిబ్బంది సాయిబాబా భక్తులు పాల్గొన్నారు.